తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో దారుణం చోటుచేసుకుంది.వైద్యుల నిర్ల‌క్ష్యంతో యువ‌కుడి ప్రాణాలు గాల్లో క‌లిశాయి. క‌రోనాతో చికిత్స పొందుతున్న వినోద్ కుమార్ అనే యువ‌కుడికి ఆక్సిజ‌న్ మాస్క్ ఊడిపోయినా సిబ్బంది ప‌ట్టించుకోలేదు.దీంతో ఊపిరి తీసుకోలేక వినోద్ కుమార్ మృతి చెందాడు. అయితే స్విమ్స్‌కు తీసుకురాక‌ముందు మ‌ద‌న‌ప‌ల్లి ఆనంద‌బాబు ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో చేర్చామ‌ని వినోద్ తండ్రి తెలిపారు.అక్క‌డ సూది మందు వేయాలంటూ మూడున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు క‌ట్టించుకున్నారని..అక్క‌డ ఫ‌లితం లేక‌పోవ‌డం స్విమ్స్‌కు తీసుకొచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.ఇక్క‌డికి వ‌చ్చాక త‌న కుమారుడు కోలుకున్నాడ‌ని...సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌న కుమారుడు చ‌నిపోయాడ‌ని వినోద్ కుమార్ తండ్రి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: