అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ప్రస్థుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా చోటా రాజ‌న్ అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. జూలై 27న చోటా రాజ‌న్ అస్వస్థతకు గుర‌వ్వ‌డంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అతను చికిత్స పొందుతున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల తాను అనుభవించ వలసిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష అనుభవించాను అని తనకు బెయిల్ మంజూరు చేయాలని ముంబై కోర్టులో చోటా రాజ‌న్ అప్పీల్ వేశారు. మూడు కేసులలో చోటా రాజన్ కు దిగువ కోర్టు వేసిన శిక్షను సవాల్ చేస్తూ ఆయన ముంబై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. చోటా రాజన్ తనపై దర్యాప్తు సంస్థలు ప్రత్యక్ష ఆధారాలు చూపించలేద‌ని  వాదించారు. చోటా రాజన్ తరఫున న్యాయవాది ద్వారా ఆయ‌న అప్పీల్ దాఖలు చేశారు. తాను ఇప్పటికే చాలావరకు శిక్ష‌ను అనుభవింనాను అని ఈ కేసులో ఇతర నిందితులు బయట తిరుగుతున్నారని వాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: