ఆన్లైన్ వ్యవస్థలో రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సేవల పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా సంస్థ జొమాటో.. ఇదే రంగంలోని మరో ప్రముఖ సంస్థ అయినా ఉబెర్ ఈట్స్ను కైవసం చేసుకునే దిశగా సిద్ధం అవుతుంది. ఉబెర్ ఈట్స్ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీలు కూడా భారీ స్థాయిలో పోటీ పడుతున్నాయి. తాజాగా పోటీ పెరిగిన నేపథ్యంలో ఈ సంస్థ 500 మిలియన్ డాలర్లను ఆస్క్ ప్రైస్గా కోట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, జొమాటో ఈ మొత్తాన్ని కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. జొమాటోలో చైనా చెల్లింపుల సంస్థ యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడులు కూడా ఉన్నాయి అని అధికారులు తెలిపారు. జొమాటో తమ ఫుడ్ డెలివరీ సంస్థను ప్రపంచమంతా విస్తరింప చేయాలని అనుకుంటున్నాది.
ఈ సంస్థలో కొన్ని వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ప్రపంచంలో సగం మందికి పైగా జనాలు వంట చేసుకోవడానికి బదులు జమాటో, స్విగ్గి ఫుడ్ డెలివరీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. భారత్లో ఉబెర్ఈట్స్ 2020 అంచనా నష్టం రూ.1,451 కోట్ల వరకు ఉండవచ్చని ఉబెర్ స్టాక్ ఎక్స్చేంజి లకు ఇచ్చిన సమాచారంలో ప్రకటించడం జరిగింది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈట్స్ కారణంగా ఐపీఓ లిస్టింగ్లో భారీ మూల్యాన్నే ఇదివరకే చెల్లించుకుంది. లిస్టింగ్ ధర నుంచి 33 శాతం పతనమైంది. ఇక్కడి మార్కెట్లో 3వ స్థానంలో ఉన్న ఈ సంస్థను విక్రయించడం ద్వారా నష్టాల నుంచి బయటపడేందుకు ఉబెర్ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది.
‘షేర్ల జారీ మార్గంలో కొనుగోలు పూర్తిచేసేందుకు జొమాటో సంస్థ చర్చలు కొనసాగిస్తుంది. అయితే, ఎంత మొత్తం అనే విషయంలో కాస్త అటుఇటుగా చర్చలు కూడా మొదలు పెట్టింది. ఈచర్చల్లో పురోగతి ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఈ డీల్తో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఉబెర్ఈట్స్ మాతృసంస్థ, ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్... డీల్ పూర్తయిన తరువాత జొమాటోలో 500–600 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది.