ఇకపోతే ఇటీవలే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వరుసగా గొలుసు చోరీలు జరుగుతూ ఉండటం పోలీసులకు సవాలుగా మారిపోయింది. కేవలం గొలుసు దొంగతనాలు మాత్రమే కాదు ఏకంగా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలను కూడా దొంగలించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఒక స్కూటీ దొంగలించాడు సదరు వ్యక్తి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగ ఆచూకీ తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఒకే ఒక్కడు హైదరాబాద్ నగరం నడిబొడ్డులో, శివార్లలో కూడా ఐదు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు అన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు.
ఈ క్రమంలోనే ఇలా గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ముఖకవళికలు అతడు దొంగలించిన స్కూటీ నెంబర్ ఆ సంఘటన జరిగిన సమయానికి సంబంధించిన వివరాలను కూడా బాధితుల నుంచి సేకరిస్తున్నారు. అయితే ఇక ఇటీవల కాలంలో వరుసగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఆ దొంగ పోలీసులు మాత్రం సవాళ్ళు విసురుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ వరుసగా గొలుసు దొంగతనాలు వెలుగులోకి వస్తుండడంతో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం.