చైనా మరో సారి భారత్ ను ఇబ్బంది పెట్టే చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చుట్టు పక్కలా దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. హిందూ మహా సముద్రంలో కీలక చర్యలు చేపడుతోంది డ్రాగన్ దేశం. చైనీస్ రీసెర్చ్ అండ్ సర్వే వెస్సెల్స్ ప్యూచర్ లో అల్ట్రనేటివ్ గా ఇండోనేషియాకు, చేరుకునేందుకు ఆఫ్రికాకు చేరుకునేందుకు కొత్త దారి వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  


కానీ హిందూ మహా సముద్ర తీరంలో నూతన దారి వేసుకుంటోంది. ఇతర దేశాలకు దగ్గరి ప్రయాణం అని చెబుతున్నా అది సరైన విషయం కాదు. ఎందుకంటే భారత్ పై ఒక వేళ యుద్దం వస్తే  సబ్ మెరైన్ లతో దాడి చేయడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది.


ఇలా ప్రతిసారి చైనా ఇండియాతో కాలువ దువ్వడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా ఇప్పటికే ఇండియాతో అనేక గొడవలు పెట్టుకుంది. గాల్వాన్ లోయలో భారత సైనికులపై దాడులు చేసి 20 మంది సైనికులను చంపేసింది. దీంతో అప్పుడే చైనాకు, ఇండియాకు యుద్దం వస్తుందని అందరూ భావించారు. భారత్ ఈ విషయంలో ధీటుగానే స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్, చైనా భారత్ సరిహద్దు వద్ద పెద్ద పెద్ద రహదారులను ఇండియా నిర్మిస్తోంది. ఒక వేళ డ్రాగన్ కంట్రీ దాడులు చేస్తే వాటిని సమర్థంగా తిప్పి కొట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.


చైనా ప్రతిసారి ప్రపంచ దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తూనే ఉంది. చుట్టు పక్కలా దేశాలు తమ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడొద్దని అంటూనే వివిధ దేశాలపై పెత్తనం ప్రదర్శించాలని చూస్తోంది. హిందూ మహ సముద్రంమార్గంలో రోడ్డు వేయడం ద్వారా చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏ దేశంపైనే సునాయాసంగా దాడులు చేసే మార్గాలను డ్రాగన్ కంట్రీ వెతుకుతోంది. చైనా ఆగడాలను ప్రపంచ దేశాలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న దేశాల సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తున్న చైనాను ఎలాగైనా నిలువరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: