పసిడి ప్రియులకు షాకింగ్ వార్త.. బంగారం ధరలు దాదాపు ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.. నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్లు కాస్త పెరిగాయి.. విదేశీ మార్కెట్ లో బంగారం రేట్లు పూర్తిగా తగ్గడంతో భారతీయ మార్కెట్ లో పెరిగాయని నిపుణులు అంటున్నారు. ఈరోజు రేటు పెరగడం తో జనాలు బంగారం కొనుగోలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారు.. నిన్నటి రేట్లతో పోలిస్తే స్వల్పంగా ధరలు పెరిగినట్లు తెలుస్తుంది.. పసిడి రేట్లు పైపైకి వచ్చినా కూడా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.



ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి కదిలింది. రూ.49,760కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 పెరుగుదల తో రూ.45,610కు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే..ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.64,800 వద్దనే స్థిరంగా ఉంది.  పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగడంతో వెండి వస్తువులు, ఆభరణాల పై డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది..



అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం ధర పెరిగింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదల తో 1808 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదల తో 23.25 డాలర్లకు పడిపోయింది.. భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు తగ్గడంతో బంగారం రేట్లలో రోజు రోజుకు వ్యత్యాసం కలుగుతుంది.. రేపటికి ఈ రేట్లు ఎలా ఉంటాయో చూడాలి.. బంగారం ధరలు పెరిగిన తగ్గిన కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కొంటూనే ఉన్నారు.. జనవరిలో పసిడి రేట్లు పూర్తిగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: