స్వర్గం నరకం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న మంచు
మోహన్ బాబు, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలతో నటుడిగా ముందుకుదూసుకెళ్లారు . విలన్ గా అలానే హీరోగా పలు సినిమాల్లో తన నటనతో ఎందరో ప్రేక్షకాభిమానులు నుండి గొప్ప క్రేజ్ దక్కించుకుని కలెక్షన్
కింగ్ గా నటప్రపూర్ణ గా కొనసాగుతున్న
మోహన్ బాబు వ్యక్తిగతంగా ఎంత మంచి మనసు గల వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య మొదటి నుండి మంచి స్నేహానుబంధం నెలకొని ఉంది. వీరు ఎప్పుడు ఏదైనా స్టేజి మీద మాట్లాడితే చాలు, ఒకరిపై మరొకరు సరదాగా జోక్స్ వేసుకోవడం, అందరినీ నవ్విస్తుండడం అనేక సందర్భాల్లో జరిగాయి.
ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సిక్కిం ట్రిప్ కి వెళ్లడం
టాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది. సిక్కిం కి వెళ్లడం కోసం
మోహన్ బాబు ని ప్రత్యేకంగా
చిరంజీవి ఒప్పించారని, వారిద్దరి స్నేహాన్ని చూస్తుంటే తనకు ఒకింత జలసీ గా ఉందని, వారు ఇలాగే ఎల్లపుడు తమ స్నేహాన్ని కొనసాగించాలని కోరుకుంటూ
మంచు లక్ష్మి నేడు ఉదయం తన సోషల్
మీడియా అకౌంట్స్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పలు
మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తానికి చాలా రోజుల తరువాత ఇలా
చిరంజీవి,
మోహన్ బాబు లను సిక్కిం మరింతగా కలిపిందని పలువురు ప్రేక్షకులు ఆనందంతో తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!