టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి నుండి కూడా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉంటారు అనే విషయం మనకు విదితమే. ప్రాణం ఖరీదు మూవీ తో తన సినిమా ప్రస్థానాన్ని మొదలెట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఆపై కొన్నేళ్ల తరువాత వచ్చిన ఖైదీ మూవీ తో అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుని అక్కడి నుండి హీరోగా వరుసగా భారీ విజయాలతో టాలీవుడ్ మెగాస్టార్ గా కోట్లాది మంది ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా మే 13న రిలీజ్ కానుంది.

స్వర్గం నరకం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న మంచు మోహన్ బాబు, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలతో నటుడిగా ముందుకుదూసుకెళ్లారు . విలన్ గా అలానే హీరోగా పలు సినిమాల్లో తన నటనతో ఎందరో ప్రేక్షకాభిమానులు నుండి గొప్ప క్రేజ్ దక్కించుకుని కలెక్షన్ కింగ్ గా నటప్రపూర్ణ గా కొనసాగుతున్న మోహన్ బాబు వ్యక్తిగతంగా ఎంత మంచి మనసు గల వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య మొదటి నుండి మంచి స్నేహానుబంధం నెలకొని ఉంది. వీరు ఎప్పుడు ఏదైనా స్టేజి మీద మాట్లాడితే చాలు, ఒకరిపై మరొకరు సరదాగా జోక్స్ వేసుకోవడం, అందరినీ నవ్విస్తుండడం అనేక సందర్భాల్లో జరిగాయి. 

ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సిక్కిం ట్రిప్ కి వెళ్లడం టాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది. సిక్కిం కి వెళ్లడం కోసం మోహన్ బాబు ని ప్రత్యేకంగా చిరంజీవి ఒప్పించారని, వారిద్దరి స్నేహాన్ని చూస్తుంటే తనకు ఒకింత జలసీ గా ఉందని, వారు ఇలాగే ఎల్లపుడు తమ స్నేహాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మంచు లక్ష్మి నేడు ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొత్తానికి చాలా రోజుల తరువాత ఇలా చిరంజీవి, మోహన్ బాబు లను సిక్కిం మరింతగా కలిపిందని పలువురు ప్రేక్షకులు ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: