బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముంబై తో రాను రాను బంధం తెంచుకుంటోంది. దానికి కారణం ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపైనే దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పెళ్లి తర్వాత ప్రియాంక లాస్ ఏంజిల్స్ లోనే త‌న భ‌ర్త‌తో క‌లిసి నివాసం ఉంటోంది. ప్రియాంక తన కంటే చిన్నవాడైన నిక్ జోనాస్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈ అమ్మడు బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. దానికి కారణం కారణం హాలీవుడ్ లో ఆఫర్లు రావడం ఒకటైతే తన భర్త తో పాటు లాస్ ఏంజిల్స్ లో ఉండాలని  ఉండాలనుకోవడం కూడా ఒకటిగా కార‌ణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని ఆస్తులను ప్రియాంక చోప్రా మెల్లిమెల్లిగా అమ్మేస్తోంది. 

గతేడాది ప్రియాంక చోప్రా ముంబైలోని కర‌ణ్‌ అపార్ట్మెంట్స్ లో ఉన్న తన అపార్ట్మెంట్ ను అమ్మేసింది. ఇక తాజాగా ప్రియాంక చోప్రా ముంబైలోని తనకు చెందిన మరో రెండు అపార్ట్మెంట్లను అమ్మేసింది. అంతేకాకుండా ప్రియాంక చోప్రా తన మరో ఇంటిని కూడా ఓ ఆఫీస్ కోసం లీజుకు ఇచ్చింది. ఈ ఆఫీస‌కు నెలకు రెండు లక్షల అద్దె వ‌స్తుండ‌గా...  రెండు ఇళ్లను మొత్తం ఏడు కోట్లకు అమ్మేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ అమ్మ‌కాల వ్య‌వ‌హారం అంతా ప్రియాంక త‌ల్లి ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది. ఇక ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఉంటున్న ప్రియాంక చోప్రా అక్కడే ఒక ఇంటిని కొనుగోలు చేసింది. 

ఇక ప్రియాంక‌ బాలీవుడ్ లో చాలా త‌క్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ నిర్మాణ రంగంలోనూ అడుగులు వేస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. హీరోయిన్లు ఆఫర్ల కోసం ప్రాంతాలు మ‌ర‌డం కొత్తేమి కాదు. మన టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది బాలీవుడ్ లో అవకాశాలు రాగానే ముంబైలో ఇళ్లను కొనుగోలు చేస్తారు. అక్క‌డ అవకాశాలు వచ్చాయంటే అక్క‌డికే వెళ్లి సెటిల్ అయిపోతారు. అలానే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే సెటిల్ అవ్వాలని నిర్న‌యించుకున్న‌ట్టు ఉంది. కానీ ప్రియాంక అభిమానులు మాత్రం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రియాంక ముంబైలో ఉండాలని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: