సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.. ఆ సినిమాతో మంచి పేరును అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత వరుస సినిమాలలో నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఇకపోతే ఇటీవల నిధి అగర్వాల్ నటించిన ‘హీరో’ చిత్రం విడుదల కు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిధి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ఈ సినిమా తరువాత నిధి పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ జరుపుకోంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పవన్, నిధి పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా నిధి పవన్ గురించి, సినిమా గురించి మాట్లాడుతూ ఒక కీలక విషయాన్ని బయట పెట్టింది. పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా బాగుంది. తన అదృష్టమని, వీలుంటే రెండోసారి కూడా ఆయనతో నటించడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక ‘హరిహర వీరమల్లు’ రెండు టైం జోన్లలో నడిచే కథ అని, ఒకటి పురాతన కాలంలో మరొకటి ఈ కాలంలో నడుస్తుందని చెప్పుకొచ్చింది.


ఇప్పటివరకు ఈ సినిమా పూర్తిగా చారిత్రాత్మకంగా ఉండబోతుందని, పవన్ సినిమా మొత్తం వీరమల్లు లానే కనిపిస్తాడని అనుకున్నారు. కానీ, ఇప్పుడు నిధి చెప్పిన ప్రకారం పవన్ రెండు గెటప్పులో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటివరకు ఈ సినిమా గురించి చెప్పని విషయాలను నిధి లీక్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..మరి క్రిష్ ఈ సినిమాను ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడో చూడాలి.. ఇక పవన్ సినిమాల విషయాన్నికొస్తే.. మరో రెండు సినిమాలలో నటిస్తూన్నారు.. అవి కూడా షూటింగ్ దశలో ఉన్నాయి..ఆ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: