టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ప్రస్తుతం హీరోయిన్ గా రోజురోజుకు తనకంటూ మరింతగా క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకెళ్తున్న నటి సమంత రూత్ ప్రభు. తొలిసారిగా గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన సమంత, ఆ మూవీలోని జెస్సి పాత్ర ద్వారా ప్రేక్షకాభిమానులని ఎంతో ఆకట్టుకున్నారు . ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టిన సమంత, ఆపైన బృందావనం, దూకుడు, ఈగ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో నటిగా మరింత గొప్పగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అటు తమిళ్ లో కూడా ఆపైన ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.

ఆ విధంగా ఒక్కో సినిమా ద్వారా ఒక్కో విజయం సొంతం చేసుకుంటూ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మంచి పేరు అందుకున్న సమంత. నాలుగేళ్ల క్రితం నాగ చైతన్య ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కొన్ని కారణాల వలన ఆమె, చైతన్య నుండి విడిపోయారు. అయితే అప్పటి నుండి కొంత మానసికంగా వేదనతో గడిపిన సమంత ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, విడాకులు అనేవి ఏ జంట కోరుకోదని, అయితే కొన్ని పరిస్థితుల కారణంగా తాను చైతన్య నుండి విడిపోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తనని అనేక మీడియాలోని తప్పుడు కథనాలు ఇబ్బంది పెట్టాయని, అయితే ఆ సమయంలో తన కుటుంబం సన్నిహితులు అందరూ కూడా తోడుండి తనకు తోడ్పాటు, ధైర్యం అందించారని, ఇటీవల పూర్తిగా ఆ డిప్రెషన్ నుండి బయటకు వచ్చిన తాను ఇకపై ధైర్యంగా తన కెరీర్ ని మరింత ప్లానింగ్ గా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు తెలిపారు సమంత.

అయితే స్త్రీ గా విడాకుల అనంతరం ఎంతో వేదన అనుభవించిన సమంత, అనంతరం తన చుట్టూ ఉన్న నెగటివిటీని ఏమాత్రం లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు నడుస్తుండడం నిజంగా నేటి స్త్రీలందరికీ కూడా ఎంతో ఆదర్శం అని, ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో సమంతని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: