ప్రముఖ
బాలీవుడ్ నటి
తనుశ్రీ దత్తా ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి తెరలేపిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ
బాలీవుడ్ భామ సింగర్ నేహా కక్కర్ను తిట్టిపోశారు. ఎందుకంటే.. ఆమె మీటూ నిందితుడైన మ్యూజిక్
డైరెక్టర్ అను మాలిక్తో కలిసి పనిచేస్తున్నారు. అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడని ముగ్గురు గాయనిలు
మీడియా ముందుకొచ్చారు.
ఇంతమంది అతన్ని కామాంధుడు అంటుంటే..
నేహా కక్కర్ మాత్రం అతని పక్కనే కూర్చుని సింగింగ్
రియాల్టీ షో ఇండియన్ ఐడల్కు జడ్జ్గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో నేహా కక్కర్ను తిట్టిపోసింది తనుశ్రీ దత్తా. ‘సోనీ
టీవీ లాంటి ఓ టాప్ ఛానెల్ లో ఇంకా ఓ కామాంధుడిని తమ షోలో పెట్టుకోవడం చూసి నేను షాకయ్యాను. మానవ విలువల కంటే టీఆర్పీలే ముఖ్యమా..? వారు చేసే పనులకు వారిని శిక్షించే పని లేదా..?
నేహా కక్కర్ లాంటి ఓ టాప్
గాయని ఆ కామాంధుడితో కలిసి ఎలా పనిచేస్తోందని అన్నారు.
సోనీ టీవీ లోని ఓ షోలో నేహా అభిమాని అందరిముందు నడుం పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు. వేధింపులంటే ఏంటో ఈపాటికి నేహాకు బాగా అర్థమై ఉంటుంది. కానీ అను మాలిక్తో కలిసి ఇప్పటికీ పనిచేస్తోంది. ఓ మహిళా సెలబ్రిటీని స్టేజ్పై అలా పట్టుకుని ముద్దు పెట్టుకోవడం చూసి సమాజంపై అసహ్యమేసింది’ అని వెల్లడించారు తనుశ్రీ.
మాలిక్ పై వస్తున్న ఆరోపణలపై ఓ
ప్రెస్ నోట్ను రిలీజ్ చేశాడు. తనను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని అన్నారు. తాను తప్పు చేసుంటే ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదని, సరిగ్గా టీవీలో కనిపించే సమయానికే ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు బాధితురాలు
సోనా మొహాపాత్ర స్పందిస్తూ.. ‘నీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నంత మాత్రాన నువ్వు మంచోడివి అయిపోవు. నీలో ఇప్పటికీ
సెక్స్ కోరికలు అలాగే ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించు. అప్పటివరకు నీ కూతుళ్లను సంపాదించమని చెప్పు’ అని ఘాటుగా స్పందించారు సోనా.