అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం బుల్లితెరపైనా హాట్ యాంకర్ గా కొనసాగుతుంది ఈ బ్యూటీ. ఆమె అందాలు, ఆమె మాటలు, తన డాన్స్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు చాలామందే ఉన్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్కు గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం టీవీ తెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది. అటు టీవీ తెరపైనే కాకుండా.. వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.
గతేడాది రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవలఆమె నటించిన ‘కథనం’ మూవీ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కానీ.. ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అనసూయ, లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో రెచ్చిపోతోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోస్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. లాగైనా షోను హిట్ చేయించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న అనసూయ, తన శాయశక్తుల పనిచేస్తోంది. ఇక గ్లామర్ డోసు పెంచేసింది.
అంతేకాదు.. తనతో పాటు మరో జడ్జిగా ఉన్న జానీ మాస్టర్ కూడా అనసూయతో మంచి కెమిస్ట్రీ నడిపించేందుకు రెడీ అయ్యాడు. అయితే షో ఎంట్రీలో వీరిద్దరూ కలిసి ‘చిట్టినడుమునే చూస్తున్నా…’ పాటకు వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. పక్కనే ఉన్న యాంకర్ ప్రదీప్ సైతం అనసూయ ఎనర్జీకి నోట మాటరాకుండా ఉండిపోయాడు. అంతేనా..గెస్ట్గా వచ్చిన హీరో కార్తీకేయ కూడా అనసూయ అందానికి బాధితుడిలానే కనిపించాడు. ఆమె డ్యాన్స్ చేస్తే, ఆటోమేటిక్గా అది వండర్పుల్ అవ్వుదంటూ..బిస్కెట్స్ వేశాడు. ఏదేమైనా రంగమ్మత్త అందాలతో షోను ఓ ఊపు ఊపేస్తోంది.