టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో తీసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా సినిమా అల వైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ టాక్ సంపాదించి ముందుకు సాగుంతోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పలు ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలగలుపుగా తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. 

 

బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించగా ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు అత్యద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇక ఇప్పటికే చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ ని రాబడుతున్న ఈ సినిమాపై కొంత నెగటివ్ విమర్శలు కూడా బాగానే వినపడుతున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. విషయం ఏమిటంటే, కొన్నేళ్లుగా త్రివిక్రమ్ గురూజీ తీస్తున్న సినిమాలను బట్టి చూస్తుంటే, పదే పదే తన గత సినిమాలోని కొన్ని సీన్స్ ని, పాయింట్స్ ని తానే కాపీ కొడుతున్నారని అంటున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమాని కూడా సరిగ్గా గమనిస్తే ఈ సినిమాలో అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల ఛాయలు చాలావరకు కనపడతాయని, సినిమా ఎంత బాగున్నప్పటికీ గురూజీ మాత్రం ఈ కాపీ సీన్స్ ని తీయడం మాత్రం ఆపడం లేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాని తన మార్క్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్, తో పాటు ముఖ్యంగా అదరగొట్టే పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టి ముందుకు తీసుకెళ్లగల సత్తా ఉన్న త్రివిక్రమ్, ఇటువంటి కొద్దిపాటి విషయాల్లో మాత్రం జాగ్రత్త పడడం లేదని, ఇకపై ఆయన నుండి రాబోయే సినిమాల్లో అయినా తన గత సినిమాల రిపీటెడ్ అంశాలు లేకుండా ఉంటె బాగుంటుందని వారు అంటున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: