టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ఎక్కువగా వినపడుతున్న పేర్లు రష్మిక మంధన, పూజ హెగ్డే. వరుసగా హిట్స్ రావడంతో ఈ ఇద్దరు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో. ఇక పారితోషకం కూడా ఈ ఇద్దరు ఒక రేంజ్ లో పెంచేశారు. ప్రస్తుతం వీరి చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రష్మిక రెండు హిట్స్ కొట్టేయగా పూజ హెగ్డే ఒక హిట్ కొట్టింది. ప్రస్తుతం పూజ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తుంది. అఖిల్ తో సినిమాలో కూడా పూజ నటిస్తుంది. 

 

రష్మిక భీష్మ సినిమాతో, సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్స్ కొట్టింది. దీనితో ఆమెకు స్టార్ దర్శకులు, స్టార్ హీరోలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఎవరికి అవకాశం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పూజ హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసింది. రెండు సూపర్ హిట్ అయ్యాయి. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలో ఆమె నటించింది. ఈ నేపధ్యంలోనే పూజను మూడో సారి కూడా తీసుకునే ఆలోచన చేస్తున్నాడు. 

 

అయితే రష్మిక పూజకు పోటీ ఇస్తుంది. పూజ తో రెండు సినిమాలు చేసాడు కాబట్టి ఎన్టీఆర్ తో సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇద్దరి పారితోషకం కూడా ఒకే రేంజ్ లో ఉంది. అయితే పూజ మాత్రం టాలీవుడ్ లో ఆఫర్లతో పాటు బాలీవుడ్ లో కూడా ట్రై చేస్తుంది. కాబట్టి రష్మికకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఇక ఆమె అల్లు అర్జున్ సుకుమార్ చిత్రంలో కూడా నటిస్తుంది. దీనితో ఎవరిని ఈ అవకాశ౦ వరిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: