మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాలు మ్యాజిక్ చేశాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఈ మూడు సినిమాలు సక్సెస్ అవడంతో ఈ కాంబో సినిమాపై ఆసక్తి పెరిగింది. చేసిన హీరోలతోనే సినిమాలు చేసే త్రివిక్రమ్ పవన్, మహేష్ ల తర్వాత బన్నిని రిపీట్ చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సంచలన విజయం అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన అసలు సిసలు సినిమాగా అల వైకుంఠపురములో హిస్టరీ క్రియేట్ చేసింది.

 

అల వైకుంఠపురములో అంట గొప్ప కథ ఏమి కాదు కాని సినిమాను దర్శకుడు నడిపించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో బాగా చేశాడు. పూజా హేగ్దే అందాలు కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం కమిటైన సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి త్వరలోనే పనిచేస్తారని తెలుస్తుంది. హ్యాట్రిక్ మూవీస్ చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబో త్వరలోనే మళ్ళీ కలిసి సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

 

త్రివిక్రమ్ తో వర్క్ బన్ని కూడా చాలా ఎంజాయ్ చేశాడట. ఈమధ్య ఒ స్టోరీ లైన్ కూడా వచ్చిందట. అల్లు అర్జున్ కు అది నచ్చడంతో సినిమా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందట. తారక్ సినిమా తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ సిఇంమా ఉంటుందని అనుకున్నారు. కాని బన్ని మళ్ళీ త్రివిక్రమ్ తో మూవీ ప్లాన్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ ఈసారి ఎలాంటి మూవీతో వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: