[8:57 AM, 3/15/2020] Venky: టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమాలు అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా వస్తుంది అంటే చాలు టాలీవుడ్ లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా మహేష్ క్రేజ్ తగ్గుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసిన చిత్రం సరిలేరు నీకెవ్వరు ఫ్లాప్ అయింది. భారీ నష్టాలను కూడా మిగిల్చింది ఈ సినిమా అంటున్నారు. అది ఎంత వరకు నిజమో తెలియదు గాని మహేష్ బాబు మాత్రం ఈ సినిమా కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. 

 

ప్రచారం కూడా చాలా ఎక్కువగానే చేస్తూ వచ్చాడు. ఇక సినిమాను మౌత్ పబ్లిసిటి చాలా ఇబ్బంది పెట్టింది. ఇక సంక్రాంతి సెంటిమెంట్ కూడా మహేష్ బాబుకి పెద్దగా కలిసి రాలేదు. గతంలో సంక్రాంతి కానుకగా అతను విడుదల చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా అతిధి సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్. దీనితో మహేష్ ఇప్పుడు సంక్రాంతి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్ బాబు వంశీ పైడపల్లి తో చేయబోయే చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూసాడు. 

 

కాని అనూహ్యంగా ఆ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నాడు అనే వ్యాఖ్యలు ఎక్కువగా ఇప్పుడు వినపడుతున్నాయి. మహేష్ బాబు సంక్రాంతి నుచి తప్పుకుని వేసవి బరిలో నిలవాలని భావిస్తున్నాడు. వేసవిలో వచ్చే ఏడాది చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అయితే ఏ పోటీ లేని సమయంలో సినిమాను విడుదల చెయ్యాలని చూస్తున్నాడట. ప్రస్తుతం అతను ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత రావడం లేదు. వంశీ పైడపల్లి తెచ్చిన కథలో మార్పులు అడిగినట్టు సమాచారం. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: