మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం మళ్ళీ మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఖైదీ నంబర్ 150తో సూపర్ హిట్ అందుకోగా సైరాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఈ సినిమాతో మరోసారి కాజల్ తో జోడీ కడుతున్నారు. సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. రీ ఎంట్రీ తర్వాత ప్రస్తుతం చేస్తున్న 3వ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ లోనే చేస్తున్నారు చిరంజీవి. బయట ప్రొడక్షన్ లో అసలు చేయకూడదని అనుకున్నారో ఏమో కానీ చిరు సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా ఉంటున్నాడు. 

 

హీరోగానే కాదు నిర్మాతగా కూడా చరణ్ సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది. అయితే చిరు రీ ఎంట్రీ తర్వాత ఆయనతో సినిమా చేయాలని చాలామంది నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అందులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారు.చిరంజీవి హోమ్ బ్యానర్ గా ఫీల్ అయ్యే గీతా ఆర్ట్స్ లో చాలా సినిమాలు చేశారు. రీ ఎంట్రీ తర్వాత మాత్రం మెగాస్టార్ అల్లు అరవింద్ ను కూడా పక్కన పెట్టాడు. చిరు కావాలని అంటే అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో సినిమా చేయొచ్చు కానీ అది మాత్రం జరగట్లేదు. ఖైదీ నంబర్ 150, సైరా, ఆబోతున్నా ఆచార్య సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తుంది. 

 

అల్లు అరవింద్ ఆఫర్ ఇవ్వట్లేదా లేక చిరుని కావాలని గీతా ఆర్ట్స్ ను రిజెక్ట్ చేస్తున్నాడా అనాది తెలియాల్సి ఉంది. ఆచార్య తర్వాత సినిమా అయినా అల్లు అరవింద్ బ్యానర్ లో చేటాడేమో చూడాలి. ఆచార్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: