ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగుతున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాల హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి, తర్వాత రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ, హిందీ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇతర భాష ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా టాలీవుడ్ జనాలు మాత్రం రకుల్కు సింహాసనం వేసి కూర్చోబెట్టారు. చిన్న సినిమాలతో భారీ కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే స్థాయికి వచ్చింది.
ఇదిలా ఉండగా ఈ భామ కరోనా నేపథ్యంలో వార్తల్లో నిలిచింది. కరోనా భయాలతో సినీ పరిశ్రమ లాక్డౌన్ ప్రకటిస్తే అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఎంచక్కా షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగిన ఓ యాడ్ షూటింగ్లో పాల్గొనడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. యాడ్ షూటింగ్ చేసినట్టు రకుల్ కూడా స్వయంగా అంగీకరించింది. ఇంట్లోనే ఉండాలని సినీ ప్రముఖులు ఓ పక్క సలహాలిస్తుంటే, ఈ బ్యూటీ షూటింగ్లో పాల్గొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా నేపథ్యంలో షూటింగ్ చేసిన భయానక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చిందంట. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నాకు ఒక యుద్దానికి వెళ్తున్నట్టుగా అనిపించింది. నా లైఫ్ లో కష్టమైన షూటింగ్ గా చెప్పుకోవచ్చు. పెద్దగా తిరిగే పనిలేకుండా ఒక్కచోటనే షూట్ ఉండటం వల్ల షూటింగ్కు ప్లాన్ చేశాం. అందుకు తగిన రక్షణ చర్యలు తీసుకొన్నాం. మా యూనిట్ తో పాటు ఒక డాక్టర్ ఎప్పుడూ మాతో ఉన్నాడని, యూనిట్ అందరికి సరైన భద్రత కల్పించారు అని రకుల్ చెప్పారంట. ఏదేమైనా రకుల్ చేసిన పనిని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు.