రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్ ఎక్స్100 సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హీరో కార్తికేయ, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తోపాటు దర్శకుడు అజయ్ భూపతికి మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది. 2018లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఆర్ ఎక్స్100 నిలిచింది. ఈ సినిమాతో అజయ్ భూపతికి మంచి టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. దీంతో తన రెండో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు.

 

 

అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పటిక వరకూ అజయ్ భూపతి రెండో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. సినిమా కథ సిద్ధమైనా క్యాస్టింగ్ ఇంకా రెడీ కాలేదు. అయితే మొత్తానికి ఈ కథ నచ్చిన హీరో శర్వానంద్ సినిమాకు ఓకే చెప్పాడు. హీరోగా శర్వా ఓకే అయినా హీరోయిన్ ఎంపిక మాత్రం జరగలేదు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు దాదాపు అంగీకరించిందనే అంటున్నారు. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పైగా.. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కూడా సినిమాకు అడ్డంకిగా నిలిచాయి. కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

 

 

ప్రస్తుతం శర్వానంద్, సాయి పల్లవి కలిసి దర్శకుడు కిశోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శర్వానంద్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. తన ఆశలన్నీ ఈ సినిమాల పైనే పెట్టుకున్నాడు. సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేస్తోంది. అజయ్ భూపతి కూడా ఆర్ ఎక్స్100 సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. సాయి పల్లవి సినిమా చేయడానికి ఓకే చెప్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: