అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరక్షన్ లో షురూ చేశాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పుష్ప సినిమాపై అంచనాలు పెంచాడు సుక్కు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. 

 

లేటెస్ట్ గా సినిమా నుండి ఒక సీన్ గురించి వార్త బయటకు వచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ఒక ఆరు నిమిషాల యాక్షన్ సీన్ అరుపులు పెట్టించేలా ఉంటుందని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పనిచేస్తారట.. 70 శాతం వరకు నిజమైన ఫుటేజ్ తో పాటుగా 30 శాతం గ్రాఫిక్స్ వాడి ఈ యాక్షన్ సీన్ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సీన్ సీమలో హైలెట్ సీన్ లో ఒకటిగా ఉంటుందని టాక్. సుకుమార్, బన్నీ ఇద్దరు కలిసి మరో సంచలనానికి సిద్ధమయ్యారు. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. 

 

కొన్నాళ్లుగా తన బాలీవుడ్ ఎంట్రీ పై వార్తలు రాగా పుష్పతో ఆ కోరిక తీర్చుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే తెలుగుతో పాటుగా మలయాళంలో అక్కడ స్టార్స్ తో ఈక్వల్ ఇమేజ్ సాధించిన అల్లు అర్జున్ తమిళ, కన్నడ భాషల్లో కూడా పుష్ప సినిమాతో సత్తా చాటేలా ఉన్నాడు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరిని మెప్పిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృస్తిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: