టాలీవుడ్ లో కొందరి కి ఎక్కువగా సెంటిమెంట్ లు అనేవి ఉంటాయి అనేది వాస్తవం. సెంటిమెంట్ ని నమ్ముకునే కచ్చితంగా సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో యువరత్న నందమూరి బాలకృష్ణ అందరి కంటే ముందు వరుసలో ఉంటారు. బాలయ్య చేతి కట్టులోనే దేవుడి దారాలు కట్టుకుంటారు. ఇవి ఎక్కువుగా ఉంటాయి. ఇక ఆయన సినిమా ముహూర్తపు షాట్ నుంచి రిలీజ్ వరకు అన్నీ పక్కగా ముహూర్తం చూసుకుని మరీ రిలీజ్ చేయడం అలవాటు. బాలయ్య కు సెంటిమెంట్లపై విపరీతమైన నమ్మకం ఎక్కువ.
ఇక బాలయ్య తర్వాత ఈ లిస్టులో ప్రధానంగా మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. తన తండ్రి పుట్టిన రోజు నాడు ఏదోక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తుంది. లేదా ఆ రోజు కొత్త సినిమా షూటింగ్ ని కూడా మొదలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో వచ్చే సినిమా విషయంలో ఇలాగే ఆలోచిస్తున్నాడు అని అంటున్నారు. ఆ రోజు సినిమాలో ఒక 10 నిమిషాలు షూట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
ఆ రోజు మహేష్ కెరీర్ లో చాలా మంచి రోజు అని టాలీవుడ్ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. మరి ఆ రోజు సినిమా చేస్తాడా లేదా అనేది స్పష్టంగా అయితే తెలియదు గాని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు అని అంటున్నారు. ఏ ఇబ్బంది లేకుండా తాము షూటింగ్ ని కేవలం 10 నిమిషాలు మాత్రమే నడిపించే ప్రయత్నం చేస్తామని ఆ రోజు తన జీవితంలో మంచి రోజు అని ప్రభుత్వాన్ని మహేష్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మహేష్ చేసే ఈ సినిమాను వచ్చే ఏడాది మే 31 కి కచ్చితంగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర ఉంది అని సమాచారం.