అవునూ.. సీనియర్ హీరోయిన్ ఇపుడు డైరెక్టర్ గా మారబోతోంది. అంతేకాదండోయ్.. ఆ సినిమాకు నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తుందట. అయితే ఇంతకీ ఈ రిస్క్ చేస్తున్న హీరోయిన్ ఎవరు? మరి హీరోగా ఎవరిని తీసుకుంది? అంత గొప్ప స్క్రిప్టు ఎవరు రాశారు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. సీనియర్ హీరోయిన్ కళ్యాణి ఇపుడు డైరెక్టర్ గా అవతారం ఎత్తబోతుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని స్క్రిప్టు పనులను పూర్తి  చేసుకుంది. చేతన్ శీను అనే హీరోను పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతుంది.దీన్ని స్వయంగా కళ్యాణే నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాలో చేతన్ శీను, సిద్ధి, సుహాసిసి మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే మొదలు కానుంది. కళ్యాణిని మలయాళంలో కావేరి అని కూడా పిలుస్తారు.ఈ చిత్ర దర్శకురాలిగా ఆమె పేరును కావేరి కళ్యాణిగా పరిచయం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. హీరోయిన్ కళ్యాణి దర్శకుడు సూర్య కిరణ్ భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే. హీరో సుమంత్ నటించిన సత్యం అనే బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు డైరెక్టర్ సూర్య కిరణ్.
అయితే అప్పట్లో "ఔనూ.. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు", "కబడ్డీ కబడ్డీ", "శేషు", "వసంతం", "లక్ష్యం" వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే డైరెక్టర్ సూర్య కిరణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ పాత్రలు మానేసింది. అయితే కొన్ని సంవత్సరాల తరువాత వారు విడిపోయారు.  గత నెల తెలుగు బిగ్ బాస్ షో నాలుగో సీజన్ లో పాల్గొన్న డైరెక్టర్ సూర్య కిరణ్ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యారు. అడపా దడపా కొన్ని పాత్రలు చేసింది. అయితే ఇపుడు డైరెక్టర్ గా మరియు నిర్మాతగా మారుతున్న కళ్యాణికి ఆల్ ది బెస్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: