యాంకర్ సుమ పేరును తెలియని తెలుగువారు ఉండరు. 45 సంవత్సరాలు వయసు దాటిపోయినా యంగ్ యాంకర్లకు పోటీగా నిలుస్తూ సుమ తన బుల్లితెర ఆదిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. కరోనా పరిస్థుతులు ప్ర్రారంభమయ్యేవరకు భారీ సినిమాల ఫంక్షన్స్ నిర్వహణకు సుమ చిరునామాగా కొనసాగుతూ ప్రతి ఫంక్షన్ కు లక్షలలో పారితోషికం తీసుకునేది.  


అయితే ధియేటర్లు మూతబడి సినిమాల విడుదల ఆగిపోవడంతో ఇప్పుడు సుమకు సినిమా ఫంక్షన్స్ వల్ల వచ్చే ఆదాయం ఆగిపోయింది. దీనితో సుమ తనకు తగ్గిపోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి యూట్యూబ్ లో ‘సుమక్క’ పేరుతో ఒక వెబ్ ఛానెల్ ను ప్రారంభించింది. కొన్ని రోజులకే బాగా పాపులర్ అయిన ఆ ఛానల్ లో సుమ వెరైటీ ప్రోగ్రామ్ లను ప్రజెంట్ చేస్తోంది. ఇప్పుడు ఈఛానెల్ చాల పాపులర్ ఛానెల్ గా మారిపోయింది.


ఈఛానెల్ లో ‘ఈట్ టాక్’ అనే స్పెషల్ షో కూడా ఉంది ఈకార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలను తన ఇంటికి పిలిచి ఏదో ఒక స్పెషల్ వంటకాన్ని వండిస్తూ వారిని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఈషోను బాగా పాపులర్ చేస్తోంది. ఇప్పటికే ఈషోలో సుధీర్ తో పులిహోర చేయించిన సుమ ప్రదీప్ తో మ్యాగీ చేయించింది. ఇప్పుడు ఈషోకు రేణు దేశాయ్ ని ఆహ్వానించడం షాకింగ్ న్యూస్ గా మారింది. నటనకు కొన్నాళ్ళుగా దూరంగా ఉన్న రేణు దేశాయ్ ''ఆద్య'' అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.


అలానే రైతు సమస్యల నేపథ్యంలో ఒక సినిమా చేయడానికి కూడ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సుమ నిర్వహించే షోకు సంబంధించి రేణూ దేశాయ్ రావడం దాని రికార్డింగ్  కూడ పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. అతిత్వరలో యూట్యూబ్ లో అప్ లోడ్ కాబోతున్న ఈప్రోగ్రామ్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారడంతో ఈవీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చి సుమకు మంచి ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: