ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్ స్టార్ మహేష్ బాబుకి తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ స్టార్ హీరోలకి సమానంగా మహేష్ ని కొనియాడుతారు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం. నవంబర్ 20న ఈ చిత్రం తమిళంలో 220 థియేటర్లలో 50 శాతం ఆకుపెన్సీ తో విడుదలయ్యింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి అక్కడ పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. మాస్ ఎంటర్టైనర్ అంటూ ఈ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం అక్కడ మొదటి రోజు 0.12 లక్షల గ్రాస్ వసూళ్ళను రాబట్టిందట. ఓ డబ్బింగ్ చిత్రానికి అదీ కరోనా టైములో ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువనే చెప్పాలి.ఈ టైములో కూడా అక్కడ స్టడీగా కలెక్షన్లు రాబడుతూ దుమ్ము రేపుతోంది ఈ సినిమా...ఈరోజు నిన్నటికి మించి బుకింగ్స్ నమోదవుతున్నాయని సమాచారం.


 మహేష్ బాబు గత చిత్రం ‘ఆగడు’ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. తమిళంలో డబ్ అయినప్పుడు అక్కడ విజయం సాధించింది. దీనిని బట్టి చూస్తుంటే.. తమిళ ప్రేక్షకులు మహేష్ బాబు నుండీ పక్కా మాస్ సినిమాలు ఆశిస్తున్నట్టు స్పష్టమవుతుంది.ఒక మాస్ హిట్ పడితే మహేష్ రేంజ్ ఎలా ఉంటుందో మరో సారి రుజువు చేసింది ఈ సినిమా...కరోనా వైరస్ కారణంతో ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ వల్ల థియేటర్లు 7నెలలుగా మూతపడే ఉన్నాయి. మెల్లమెల్లగా వాటిని ఓపెన్ చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారు కానీ.. జనాల్లో కరోనా భయం ఇంకా తగ్గకపోవడంతో ఫలితం పెద్దగా కనిపించడం లేదు.


మొన్ననే కొన్ని పాత సినిమాలతో వైజాగ్ లోని ఐనాక్స్ ను ఓపెన్ చేశారు. అయితే కనీసం ఒక్కో స్క్రీన్ కు 10 మంది కూడా రాలేదు. ఇలాంటి టైంలో మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు  "సరిలేరు నీకెవ్వరూ"  సినిమాని   తమిళంలో డబ్ చేసి విడుదల చెయ్యడం నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి నిదర్శనం. ఇక ప్రస్తుతం మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి: