బాహుబలి తర్వాత ఆ సినిమాకు మించి అంచనాలను ఏర్పరచుకుని వస్తుంది ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే సినిమా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. సినిమాలో ఇద్దరు హీరోలు కలిసే సీన్ అయితే సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్.

100 మంది పోలీసులు, 300 మంది ఆదీవాసీలు ఉన్న టైం లో ఓ భారీ యాక్షన్ సీన్ ఎన్.టి.ఆర్ పై షూట్ చేశారట. ఇక ఆ సీన్ లోనే రాం చరణ్ వచ్చి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఇద్దరు హీరోలు ఒకే తెర మీద కనిపించే ఆ సన్నివేశం అదిరిపోతుందని అంటున్నారు. కచ్చితంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు. దాదాపు 25 నిమిషాల దాకా వచ్చే ఈ సీన్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను సీట్లలో కూర్చోనివ్వదని అంటున్నారు.

ఇద్దరు ఒకటై కలిసి చేసే పోరాటం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమాలో ఈ ఒక్క సీన్ కోసం రాజమౌళి చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే రిలీజైన రామ రాజు, కొమరం భీమ్ టీజర్ లు సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. సినిమాలో అజయ్ దేవగన్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిస్జ్దే. అలియా భట్, ఒలివియా మోర్స్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజులు ప్లాన్ చేశాడట జక్కన్న.                                      



మరింత సమాచారం తెలుసుకోండి: