సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు స్పైడర్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ప్లాపుల్లో ఉన్న మహేష్ బాబు ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో  వరుసగా మూడు సక్సెస్లు అందుకున్నారు.

ఇక అతి త్వరలో ఆయన నటించనున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమాని మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్నట్లు టాక్. ఇకపోతే దీని తర్వాత దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక భారీ సినిమా చేయనున్నారు మహేష్ బాబు. ఇటీవల దీనికి సంబంధించి రాజమౌళి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఇక ఇప్పటికే మరో వైపు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు పాన్ ఇండియా సినిమాల పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

మరోవైపు అతి త్వరలో మహేష్, రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా అత్యంత భారీ వ్యయంతో భారీగా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ స్టార్ కి దేశ విదేశాల్లో కూడా మరింతగా ఫాలోయింగ్ పెరగడం ఖాయమని అప్పటివరకు ఒక లెక్క అయితే ఆ తర్వాత క్యాలిక్యులేషన్స్ పూర్తిగా మారిపోతాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆ సినిమా భారత దేశంలోనే గొప్ప సంచలన రికార్డ్స్ కొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: