మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా కి ముందు రవితేజ సినిమాలు దాదాపు ఆరు  ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు.. ఇదే డైరెక్టర్ తో గతంలో డాన్ శ్రీను, బలుపు చిత్రలుచేసి హిట్ కొట్టాడు రవితేజ.. ఇప్పుడు క్రాక్ తో హ్యాట్రిక్ కి సిద్ధంగా ఉన్నాడు.

అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ కి క్రాక్ సినిమా మస్ట్ నీడెడ్ హిట్ సినిమా అయ్యింది.. ఇక ఈ సినిమా తరువాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వీర సినిమా తో దర్శకుడిగా రవితేజ సినిమా చేసినా ఆ సినిమా హిట్ గా నిలవలేదు.. మరి ఈ సినిమా ఎం చేస్తుందో చూడాలి.

ఇక రవితేజ డైరెక్టర్ మారుతి కాంబో లో సెట్ అయిన సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడంలేదు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతకు, రవితేజ కు ఇష్యూస్ వచ్చాయట. క్రాక్ తో హిట్టు కొట్టి అప్పుడు తన రేంజ్ కి తగ్గట్లు పారితోషికం తీసుకుంటానని మాస్ రాజా గట్టిగానే చాలెంజ్ చేశాడని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాస్ రాజా వేరే సినిమాలతో బిజీ అవుతుండడం వలన ఆ ప్రాజెక్టు చేయలేనని డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మారుతి లాంటి దర్శకుడికి మాస్ రాజా నో చెప్పడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: