ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు, టీవీలకు సంబంధించిన ప్రోగ్రామ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఇంకోవైపు కుటుంబాన్ని అన్ని బాధ్యతలను సమానంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ రోజు రోజా.. రాజకీయంగా ఇంత పలుకుబడికి కారణం ఆమె చేసిన సినిమాలనే చెప్పాలి. సినిమాల మూలంగానే ఆమెకు ఇంత పాపులారిటీ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో కూడా రోజా పాపులారిటీ మాస్‌లోకి మరింత పోయేలా దోహదం చేసింది. ఇక రోజా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది.ఇక బాలకృష్ణ హీరోగా నటించిన 'భైరవ ద్వీపం' సినిమా రోజాను స్టార్ హీరోయిన్‌ను చేసింది.

ఈ సినిమాలో ఆమె రాకుమారిగా తనదైన నటన ప్రదర్శించింది.ఈ సినిమా తర్వాత రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఐతే.. రోజా ఎన్నో సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమెకు వ్యక్తిగతంగా సంతృప్తి ఇచ్చిన చిత్రం 'అన్నమయ్య'. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది కూడా.అవును ఈ సినిమాలో రోజా ప్రధాన కథానాయికగా నటించకపోయినా.. శ్రీ వేంకటేశ్వర స్వామిపై తెరకెక్కిన 'అన్నమయ్య' చిత్రంలో నటించడం తన భాగ్యమంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఆ ఏడు కొండలస్వామి దయ వల్లే ఆయన నీడన ఉన్న నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని రోజా పలు ఇంటర్య్యూలో చెప్పింది.

 ఆ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఉన్న నమ్మకంతో పాటు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం అనగానే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నానని రోజా పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. అప్పటికే తనకు రాకుమారిగా ఇమేజ్ ఉంది. అది ఈ సినిమాకు బాగానే ఉపయోగపడినట్టు చెప్పుకొచ్చింది. మొత్తంగా రోజా సినీ కెరీర్లో అన్నమయ్య సినిమా తనకు  ప్రత్యేకంగా నిలిచిందన్నమాట.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: