మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్, తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన కృతి శెట్టి ఇద్దరు మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టారు. బుచ్చి బాబు డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సుకుమార్ పర్యవేక్షణ జరిగింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రాణం అయ్యింది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఈ సినిమా ఊహించని విధంగా లాభాలు తెచ్చి పెట్టడంతో ఉప్పెన సినిమా నిర్మాతలు హీరో, హీరోయిన్ కు రిటర్న్ గిఫ్టులు ఇచ్చారట. అదేంటి అంటే.. సినిమా కోసం అనుకున్న రెమ్యునరేషన్ కాకుండా వైష్ణవ్ తేజ్ కు 1 కోటి, కృతి శెట్టికి 25 లక్షలు అదనంగా ఇచ్చారట. ఇది డెఫినెట్ గా మెచ్చుకోవాల్సిన విషయమే. కేవలం వారి రెమ్యునరేషన్ ఇచ్చేశాం కదా అని ఊరుకోకుండా.. వచ్చిన లాభాల్లో వారికి తిరిగి ఎంతోకొంత ఇవ్వడం నిర్మాతల గొప్ప మనసుని తెలియచేస్తుంది.

ఉప్పెన సినిమాకు విజయ్ సేతుపతి కూడా బాగా హెల్ప్ అయ్యారు. ఆయన పాత్ర అనుకున్న దానికన్నా బాగా రావడం.. సినిమా హిట్ లో ఆయన కూడా ఒక పెద్ద హ్యాండ్ గా ఉన్నారు. మొత్తానికి ఉప్పెన సినిమా లాభాల్లో హీరో, హీరోయిన్ మళ్లీ డబ్బులు కానుకగా ఇవ్వడం అనేది గొప్ప విషయం. చూస్తుంటే ఇదే కాంబినేషన్ లో వీరిద్దరితో మైత్రి మూవీ మేకర్స్ మరో సినిమా చేసేలా ఉన్నారని చెప్పొచ్చు. వైష్ణవ్ తేజ్ క్రిష్ కాంబో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. కృతి శెట్టి ఆల్రెడీ నాని, సుధీర్ బాబులతో నటిస్తుంది.                                          

మరింత సమాచారం తెలుసుకోండి: