పంజా వైష్ణవ్ తేజ్..ఈ పేరు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్..మొదటి మూవీ తోనే మెగా హీరో సత్తా ఏంటో నిరూపించాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన మూవీ ఉప్పెన. దేవి శ్రీ మ్యూజిక్ , కృతి శెట్టి గ్లామర్, బుచ్చిబాబు టేకింగ్, మైత్రి మూవీ నిర్మాణం ఇలా అన్ని సెట్ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.

దీంతో వైష్ణవ్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేసాడు. ఇక ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ ఫై నాగార్జున వైష్ణవ్ తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ సైతం వైష్ణవ్ ను హీరోగా పెట్టి కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట. అయితే వైష్ణవ్ తో చేయాలనుకున్న కథను ముందుగా నాని తో చేయాలనీ కథ వినిపించాడట. కానీ యాక్షన్ కథ కావడం తో నాని నో చెప్పాడట. ఇక ఇప్పుడు అదే కథను కాస్త అటు ఇటు చేంజెస్ చేసి వైష్ణవ్ కు వినిపించారట. కథ బాగా నచ్చడం తో వెంటనే వైష్ణవ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వైష్ణవ్ ఉప్పెన సక్సెస్ జోరు లో ఉన్నాడు. సినిమా పెద్ద విజయం సాధించడం తో మైత్రి మూవీస్ వారు వైష్ణవ్ తేజ్ కు అలాగే కృతి శెట్టి కి అదనంగా కొంత ఎమౌంట్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ నటించిన మూవీ కి కొండపొలం అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. అతి త్వరలోనే ఈ సినిమా థియేటిరికల్ రిలీజ్ గురించి ఓ అధికార ప్రకటన రానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: