ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో చేశాడు. ఈ మూవీ ని కేవలం నలభై రోజుల్లో కంప్లీట్ చేయడం గొప్ప విశేషం. ఇక ఈ మూవీని లాక్ డౌన్ టైమ్ లో జోరుగా పూర్తి చేయడం ద్వారా క్రిష్ సంచలనం క్రియేట్ చేశాడు. ఇక ఈ మూవీ ఇపుడు రిలీజ్ కి రెడీగా ఉందిట. అసలే ఉప్పెనతో టాప్ లెవెల్ లో ఉన్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా కూడా ఇదే టైమ్ లో రిలీజ్ చేస్తే గ్యారంటీ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ మూవీని ప్రముఖ నవల కొండపొలం ఆధారంగా తీశారు.
ఈ మూవీని లో రకుల్ ప్రీత్ సింగ్ వైష్ణవ్ తేజ్ కి పెయిర్ గా నటించింది. ఈ మూవీలో ఆమె డీ గ్లామర్ రోల్ ప్లే చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఇపుడు టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. జంగిల్ బుక్ పేరిట ఈ మూవీ కి టైటిల్ పెట్టనున్నారు అంటున్నారు. మొత్తానికి ఈ మూవీని మంచి టైమ్ చూసుకుని సమ్మర్ కి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. మొత్తానికి రెండవ మూవీ కూడా హిట్ కొడితే మాత్రం వైష్ణవ్ జోరుని ఎవరూ ఆపలేరు. ఇక మూడవ సినిమా ఎటూ కింగ్ నారార్జున సొంత బ్యానర్ లో ఉంటుంది. ఇలా వైష్ణవ్ తేజ్ తన కెరీర్ కి బలమైన పునాదులే వేసుకుంటున్నారు అంటున్నారు.