రాజమౌళి టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఆయన గురించి చెప్పుకున్నపుడు బాహుబలికి ముందు ఆ తరువాత అని మరీ చెప్పాలి. బాహుబలి తరువాత ఆయన రేంజి ఎక్కడిలో వెళ్ళిపోయింది. ఆయన సినిమా కోసం యావత్తు భారత దేశం ఎంతో అసక్తిగా ఎదురుచూస్తూ వస్తోంది.

ప్రస్త్రుతం ట్రిపుల్ ఆర్ మూవీ మీద కూడా బాలీవుడ్ అటెన్షన్ ఉంది. ఈ మూవీని టాలీవుడ్ లో రెండు టాప్ లెవెల్ కుటుంబాలకు చెందిన ఈ తరం హీరోలతో రాజమౌళి ప్లాన్ చేయడంలోనే సక్సెస్ సీక్రెట్ ఉంది. ఇక ఈ మూవీ ని వందల కోట్ల బడ్జెట్ లో ఎలాంటి రాజీ లేకుండా రాజమౌళి నిర్మిస్తున్నారు. బాహుబలి కంటే పెద్ద హిట్ చేయడనికి కూడా చూస్తున్నారు.

ఇదిలా ఉంటే రాజమౌళి తరువాత చేయబోయే సినిమా విషయంలో అప్డేట్స్ ఎన్నో వస్తున్నాయి. అవేంటి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి  సినిమా ఉంటుందని. అంటే రాజమౌళి తరువాత సినిమా హీరో కూడా టాలీవుడ్ నుంచే ఎంచుకున్నారు అన్నదే ఇక్కడ పాయింట్. నిజానికి పాన్ ఇండియా డైరెక్టర్ గా రాజమౌళికి ఎంతో అవకాశం ఉంది. ఆయన బాలీవుడ్ నుంచి హీరోలను ఎంచుకోవచ్చు. అలాగే వేరే రీజనల్ లాంగ్వేజెస్ నుంచి కూడా ఎంపిక చేసుకుని సినిమాలు తీయవచ్చు.

మిగిలిన పాన్ ఇండియా డైరెక్టర్లు చేస్తున్నది అదే. కోలీవుడ్ కి చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో  రామ్ చరణ్ తో సినిమాలు తీస్తున్నాడు. ఇక కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా టాలీవుడ్ హీరోలతో మూవీస్ కి కమిట్ అయ్యాడు. బాలీవుడ్ కి చెందిన ఓం రౌత్ టాలీవుడ్ కి చెందిన ప్రభాస్ తో ఆదిపురుష్ చేస్తున్నాడు. మరి వారు తమ సొంత భాషలోని హీరోలను వదిలి వేరే భాషల హీరోలతో సినిమాలు చేస్తూంటే రాజమౌళి మాత్రం కేవలం టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు తీయడమే చర్చగా ఉంది. రాజమౌళి మరి ఎపుడు బాలీవుడ్ హీరోలతో మూవీస్ తీస్తాడో అన్న చర్చ అయితే గట్టిగానే ఉంది. కానీ రాజమౌళి మాత్రం ఓన్లీ తెలుగు అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: