ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర తారలందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఏ హీరోని అడిగినా ఇదే మాట చెబుతునన్నారు. కారణం అన్ని ఇండ్రస్టీ ల్లోనూ తమ క్రేజ్ తో పాటు మార్కెట్ ని పెంచుకోవడమే. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఎలాగైనా పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకోవాలనేదే వారి ఆశ. అయితే కేవలం హీరోలు మాత్రమే ఈ పాన్ ఇండియా ఇమేజ్ ని కోరుకుంటారా?హీరోయిన్లు కావాలనుకోరా? అంటే ఎందుకు అనుకోరు.. కచ్చితంగా అనుకుంటారు. అలా తమకి పాన్ ఇండియా ఇమేజ్ కావాలని కలలు కనే స్టార్ హీరోయిన్ రేసులో ముందు వరుసలో ఉంది పూజా హెగ్డే..

ప్రస్తుతం ఈమె ఇండ్రస్టీ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే స్టార్ హీరోయిన్లు అయినంత మాత్రాన అందరికీ పాన్ ఇండియా ఇమేజ్ రాదు. అలా వస్తే వాళ్ళు అదృష్టవంతుల కిందే లెక్క.అలాంటి అదృష్టవంతులలో తాను కూడా ఉన్నానని చెప్తోంది ఈ బుట్టబొమ్మ.ఈ హీరోయిన్ కి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందట.ఎప్పటికైనా తాను పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలని.ఇప్పుడు తన కోరిక నెరవేరిందని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది ఈ హీరోయిన్.ఇక తాజా ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.."బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో 'మొహంజదారో' సినిమా చేసిన సమయంలో నేను చాలా కలలు కన్నాను.ఆ సినిమాతో నేను పాన్ ఇండియా హీరోయిన్ అవుతానని అనుకున్నాను.

కానీ ఆ సినిమా సరిగ్గా ఆడకపోయే సరికి,అప్పట్లో నా కెరీర్ గ్రాఫ్ తగ్గింది. అయితే, ఆ తర్వాత కొన్ని సక్సెస్ లతో నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు.దీనికితోడు బాలీవుడ్ లో కూడా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నాను. అలాగే తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాను. కాబట్టి, పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనే నా చిరకాల కోరిక, ఇప్పుడు నిజమైందనుకుంటున్నాను' అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక ఇంటర్వ్యూ చివర్లో ప్లాప్ సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: