టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో నటించిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా కూడా ఒకటి.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున రెండు విభిన్న పాత్రలను పోషించాడు. ఇక 2016 సంక్రాంతి బరిలో నిలిచి న ఈ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది.అదే సంక్రాంతి బరిలో ఇతర సినిమాలు పోటీలో ఉన్నా కూడా భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.ఇక నాగ్ సరసన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు.అయితే గత రెండేళ్లుగా ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే అనుకున్నట్లుగానే ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేసాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

 ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది.అయితే ఫైనల్ స్క్రిప్ట్ విన్న నాగ్.. అందులో కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది.ఇక నాగార్జున కోరిక మేరకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మార్పులు చేయడంతో ఈ సినిమాకి నాగ్ అంగీకారం తెలిపాడు.ఇక బంగార్రాజు పేరుతో ఈ సీక్వెల్ తెరకెక్కుతుంది.ఇందులో నాగార్జున తో పాటుగా ఆయన వారసుడు అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.అంతేకాదు చైతు సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు తాజా సమాచారం.

మొదటి సినిమా లాగానే ఈ సీక్వెల్ ని కూడా రొమాంటిక్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట,పవన్ కళ్యాణ్, రానా ల అయ్యప్పనున్ కోషియం రీమేక్ తో పాటు అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 3 వంటి భారీ సినిమాలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్ లో నాగార్జున బంగార్రాజు కూడా చేరిపోయింది. దీంతో ఈ సారి సంక్రాంతి రేసు ఓ రేంజ్ లో ఉండబోతోందని చెప్పవచ్చు.మరి ఈ పొంగల్ రేస్ లో ఎవరి సినిమా విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వేచి చూడక తప్పదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: