ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అఖండ సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ యేడాదిన్నర క్రితమే స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవ్వడంతో అఖండ లేట్ గా థియేటర్లలో కి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాపై ఒక్క బాలయ్య అభిమానుల్లోనే కాకుండా మాస్ ఆడియెన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.
రాయలసీమ తో పాటు కోస్తా ఆంధ్రలో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతోంది. ఈ క్రమంలోనే బాలయ్యకు పట్టున్న కృష్ణా - గుంటూరు తో పాటు ఈస్ట్ గోదావరిలోనూ భారీ రేటు పలుకు తుంది. అఖండ ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులు ఏకంగా 5 కోట్లకి పైగా పలికి నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రేట్లను చూస్తుంటేనే అఖండకు ఏ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుందో తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా.. ఆ వెంటనే అనిల్ రావిపూడితో మరో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.