ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టుల ను తెర‌మీద‌కు తీసుకు వ‌స్తున్నారు. బాల‌య్య హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో అఖండ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి బాల‌య్య కాంబినేష‌న్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో సింహా సినిమా తో పాటు లెజెండ్ సినిమాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. 2010లో వ‌చ్చిన సింహా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక 2014 లో ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి వీరి కాంబోలో లెజెండ్ వ‌చ్చింది. ఈ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సారి అఖండ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా షూటింగ్ యేడాదిన్న‌ర క్రిత‌మే స్టార్ట్ అయ్యింది. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ లేట్ అవ్వ‌డంతో అఖండ లేట్ గా థియేట‌ర్ల‌లో కి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాపై ఒక్క బాలయ్య అభిమానుల్లోనే కాకుండా మాస్ ఆడియెన్స్ లో కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది.

రాయ‌ల‌సీమ తో పాటు కోస్తా ఆంధ్ర‌లో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు భారీ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌కు ప‌ట్టున్న కృష్ణా - గుంటూరు తో పాటు ఈస్ట్ గోదావ‌రిలోనూ భారీ రేటు ప‌లుకు తుంది. అఖండ‌ ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులు ఏకంగా 5 కోట్లకి పైగా ప‌లికి న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రేట్ల‌ను చూస్తుంటేనే అఖండ‌కు  ఏ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుందో తెలుస్తోంది. సినిమా త‌ర్వాత బాల‌య్య క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా.. ఆ వెంట‌నే అనిల్ రావిపూడితో మ‌రో సినిమా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: