టాలీవుడ్ లో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. ఎవరి టాలెంట్ వారిది. కొందరు వరసపెట్టి సినిమాలను సక్సెస్ చేస్తూ ఉంటే మరికొందరు ఫ్లాప్స్ తీసినా కూడా సంచలనమే. ఇక వారు హిట్ కొట్టారూ అంటే దాని రీసౌండ్ అలా ఇలా ఉండదు అంతే.

అలాంటి డైరెక్టర్లో ముందు వరసలో ఉండేది పూరీ జగన్నాధ్. పూరీ జగన్ ఫస్ట్ మూవీ బద్రీ, ఆ తరువాత ఆయన ఎన్నో సినిమాలు తీశారు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు. కొన్ని ట్రెండ్ సెట్టర్స్ గా కూడా మిగిలాయి. పోకిరి, బిజినెస్ మ్యాన్. ఇడియట్. అమ్మా నాన్నా ఒక తమిళ అమ్మాయి వంటి మూవీస్ ని ఎవరూ మరచిపోలేరు. ఇదిలా ఉంటే ఆ మధ్య దాకా పూరీ తీసిన సినిమాలు కొన్ని సరిగ్గా ఆడలేదు.

ఇక ఇస్మార్ట్ శంకర్ తో దుమ్ము దులిపేశాడు. ఒకే ఒక్క హిట్ తో మళ్లీ లైం లైట్ లోకి వచ్చేశారు. పూరీతో చేసేందుకు స్టార్ డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తున్న వేళ ఆయన విజయ్ దేవరకొండతో లైగర్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీని ప్యాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నాడు. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం పూరీ క్రేజ్ మామూలుగా ఉండదు.

మరో వైపు పూరీతో సినిమా చేసేందుకు బాలయ్య రెడీగా ఉన్నారు. అలాగే పూరీ చేయాలనుకుంటున్న హీరో మెగాస్టార్. ఆయన సైతం లైగర్ హిట్ అయితే కనుక ఓకే అంటారని అంటున్నారు. అలాగే మరో మారు యంగర్ జనరేషన్ హీరోలు, స్టార్లు పూరీ వైపు చూపు తిప్పడం ఖాయమనే అంటున్నారు. ఏది ఏమైనా పూరీ లైగర్ మూవీతో మళ్లీ దూసుకురావడం అయితే ష్యూర్ అనే అంతటా వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: