మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి  పిక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాలవైపు దృష్టి మళ్లించి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది, ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి, అదే స్థాయిలో విడుదల కూడా చేసి కుర్ర హీరోలకు నేనేం తక్కువ కాదు అని మెగాస్టార్ చిరంజీవి నిరూపించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాల్లో నటిస్తూ చూపిస్తున్నాడు, అందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు, ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు, మరియు తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి పాల్గొంటున్నాడు, ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితమే వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించాడు, ఇలా ఇప్పటికి నాలుగు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఒక సినిమాను లైన్ లో పెట్టుకొని రెడీగా ఉన్న చిరంజీవి కుర్ర హీరోలకు నేనేం తక్కువ కాదు అనే రేంజ్ లో సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: