కబ్జా .. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రశాంత్ నీల్ కు ఈ పదం సరిగ్గా సూట్ అవుతుంది .. ఒకరిద్దరు కాదు తెలుగులో ఉన్న హీరోలందర్నీ తన లైనప్ లోకి తీసుకుపోతున్నాడు .. కేజియఫ్ తర్వాత కన్నడ ను వదిలేసి .. తన ఫుల్ ఫోకస్ అంతా టాలీవుడ్ వైపు పెట్టిన నీల్ .. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టబోతున్నాడు .. ఇక మరి ఆ సినిమా ఏంటి .. అందులో హీరో ఎవరు అనే విషయాలు ఈ స్టోరీ లో చూద్దాం .. కేజియఫ్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్ ..


ఈయనతో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. ఇప్పటికే ప్రభాస్ తో సలార్ చేశాడు రూ. 600 కోట్ల రాబట్టాడు .  ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో ఉండగానే తర్వాత ప్రాజెక్ట్స్ ను అప్పుడే లైన్ లో పెట్టేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ .. ప్రస్తుతం నీల్‌ లిస్ట్ భారీగానే ఉంది .  ఎన్టీఆర్ సినిమా తర్వాత ప్రశాంత్ లిస్టు లో స్టార్ హీరోస్ ఉన్నారు .. ఇప్పటికే కేజిఎఫ్ 3 అనౌన్స్ చేసిన ఇది ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు . అలాగే సలార్ 2 కూడా లైన్లో ఉంది .. అటు ప్రభాస్ ఇటు నీల్ వేర్వేరు సినిమాల తో బిజీగా ఉండటంతో సలార్ 2 కూడా ఇప్పట్లో మొదలవడం కష్టమే ..


ఇక మరి ఈ గ్యాప్లో అల్లు అర్జున్ వచ్చి చేరాడు .. అన్నీ కుదిరితే అట్లి తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ప్రశాంత్ నీతోనే కానుంది . 2026 జూన్ 25న డ్రాగన్ రిలీజ్ కానుంది .. అప్పటికి అట్లీ , అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పూర్తికానుంది .. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రశాంత్  నిల్ కాంబో మూవీ మొదలవుతుందని అంటున్నారు .. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు రావణం అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేయబోతున్నారు . మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో  మూవీ రానుందని అంటున్నారు .. రామ్ చరణ్ , మహేష్ బాబు తోనూ  ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయని ప్రచారం కూడా బయటకు వచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: