ఈచిత్రం 6రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కేవలం 14.19కోట్లషేర్ ను మాత్రమే రాబట్టిందని సమాచారం. కాగా ఏపీ &తెలంగాణ లో ఈచిత్రం 20కోట్ల కు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. ఇక రేపు సూర్య నటించిన బందోబస్త్ , వరుణ్ తేజ్ వాల్మీకి థియేటర్లలోకి రానుండడంతో గ్యాంగ్ లీడర్ కు అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ గనుక వస్తే గ్యాంగ్ లీడర్ పరిస్థితి మరింత దిగజారునుంది. రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటీమణులు లక్ష్మి , శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100ఫేమ్ కార్తికేయ విలన్ రోల్ లో కనిపించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
నైజాం - 5.75 కోట్లు
నెల్లూరు - 47లక్షలు
కృష్ణా - 1.08కోట్లు
పశ్చిమ గోదావరి - 86లక్షలు
ఉత్తరాంద్ర - 1.90కోట్లు