మహిళలను ఎన్ని చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.. దేశంలో ఏదోక మూల అమ్మాయిలను హింసిస్తూ రేప్ చేసి మరీ దారుణంగా చేస్తున్నారు.. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే..తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మండపేటమండలం ఇప్పనపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

 

సమీప మండలంలో ఓ యువతి డిగ్రీ చదువుతుంది..స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇప్పనపాడు గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు అడ్డగించారు. ఆమె స్నేహితుడిని చితకబాది యువతిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.ఒకరి తర్వాత మరొకరు కలిసి ఆమెను అతి కిరాతకంగా చిత్ర హింసలకు గురి చేస్తూ కామా దాహాన్ని తీర్చుకున్నాడు...

 

 

ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు మండపేట పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిగ్రీ యువతి సామూహిక అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది... జరిగిన విషయాన్ని తల్లి దండ్రులకు సమాచారం అందించారు..

 

 

 

దీంతో హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.. అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. నిందితులు ఆ ప్రాంతం వారు కాదని వేరే ఏరియా నుండి వచ్చిన వారూగా పోలీసులు గుర్తంచారు.. పరారీలో ఉన్న నగుగురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: