క‌రోనా వైర‌ష్ వ్యాప్తి స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ కీల‌క పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌రోనాపై సంఘ‌టిత పోరాటంలో భాగంగా, ఏప్రిల్ 5న ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆర్పేసి దివ్వెలు వెలిగించాల‌నే పిలుపున‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది.  ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో  దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించారు. అయితే ఈ జాబితాలో మంత్రి కేటీఆర్‌ తనయుడు, సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా అంతం కావాలంటూ నిత్య దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు. 

 

లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఒక పేరుతో దీపాలు వెలిగిస్తానని హిమాన్షు ప్రకటించారు. తొలిరోజు ఆదివారం కిల్‌ కరోనా, రెండోరోజు సోమవారం విన్‌ కరోనా, మూడోరోజు మంగళవారం లీవ్‌కరోనా అని రాసి ఉన్న అక్షరాలపై దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా అంతం కావాలంటూ ఆకాంక్షించిన హిమాన్షు.. ప్రతి  ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 

 

క‌రోనాపై పోరులో భాగంగా, ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతీ ఒక్కరూ ఇంట్లోని అన్ని లైట్లూ ఆపివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు.. కొవ్వొత్తి లేదా దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్, టార్చ్ వేయాలని దీంతో ఎవరూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎవరూ బయటకు రాకుండా.. కేవలం ఇంట్లో కూర్చొని ఈ పని చేయాలని.. కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలని’ ప్రధాని మోదీ చెప్పారు. అందరూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం (భౌతిక దూరం) పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే.. శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించొద్దని కూడా ఆయన చెప్పారు. ఓ వైపు ప్ర‌ధాని మోదీ పిలుపున‌కు విశేష స్పంద‌న రావ‌డం, తాజాగా సీఎం కేసీఆర్ త‌న‌యుడు హిమాన్షు తీసుకున్న నిర్ణ‌యం ఖ‌చ్చితంగా మోదీజీని ఖుష్ చేసేవ‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: