వివాహం జరిగిన తర్వాత ఎవరైనా పిల్లలు కని హాయిగా వారితో జీవితాన్ని గడపాలని అనుకుంటారు.  తమ పిల్లలు ప్రయోజకులై.. తమ పేరు నిలబెట్టాలని చూస్తారు. అలాంటిది ఓ తండ్రి తన కొడుకు పాలిట కాలయముడయ్యాడు. కన్న కొడుకునే కడతేర్చాడు ఓ కసాయి తండ్రి.. అయితే అంత కిరాతంగా చంపింది సాదాసీదా మనిషి కూడా కాదు ఓ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ కావడం గమనార్హం.  ఆ తరువాత పోలీసులకు చిక్కకుండా తన కొడుకు కరోనా వైరస్ తో మరణించాడని అందరినీ నమ్మించాడు. కానీ, ఇంతలో ఏమైందో ఏమో పశ్చాత్తాపానికి గురై పోలీసుల ముందు నిజం కక్కాడు.  కన్న కుమారుడిని దారుణంగా హత్య చేసిన టర్కీ ఫుట్ బాల్ స్టార్ కెవెర్ టోక్టాస్, అతను కరోనా సోకి చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు కూడా చేశాడు.

 

ఈ ఘటన టర్కీలో ఫుట్ బాల్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే.. కరోనా లక్షణాలు కనిపించిన కారణంతో గత నెల 23న తన ఐదేళ్ల కుమారుడు ఖాసిమ్ తో కలిసి నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ లోని ఓ హాస్పిటల్ లో కెవెర్ టోక్టాస్ చేరాడు.  వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ నెగటివ్ రావడంతో, ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరినీ ఐసోలేషన్ లో ఉంచారు. ఆపై ఈ నెల 4న అతని గదిలోకి వెళ్లిన టోక్టాస్, కుమారుడి ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశాడు.

 

ఆపై ఏమీ ఎరుగనట్టు ఉండిపోయాడు.  ఎన్ని రకాలుగా రక్షించాలని చూసినా ఆ పసిప్రాణం దక్కలేదు.  ఖాసిమ్ కరోనాతో మరణించాడని ప్రపంచాన్ని నమ్మించిన టోక్టాస్, అంత్యక్రియలు కూడా చేశాడు. ఇక 11 రోజుల తరువాత పోలీసుల ముందుకు వచ్చి, తాను చేసిన దుర్మార్గం గురించి చెప్పాడు. కొడుకంటే తనకు ఇష్టం లేదని, అందుకే చంపేశానని, తనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని చెప్పాడు. ఈ విషయం విన్న తర్వాత పోలీసలు మొదట ఖంగు తిన్నారు.. ఆ తర్వాత అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: