నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ కు చెందిన సాయిలు అనే 46 ఏళ్ల వ్యక్తికి చౌదర్ పల్లి కి చెందిన అనసూయతో పాతికేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్దికాలం పాటు కాపురం ఎంతో సాఫీగా సాగిపోయింది. కాని అంతలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త సాయిలు. ఈ క్రమంలోనే సూటిపోటి మాటలు అంటూ తరచూ వేధింపులకు గురి చేసే వాడు. ఇక ఈ విషయాన్ని అనసూయ తన తల్లికి చెప్పుకుని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఓ సారి అత్త తో మీ కూతురు వివాహేతర సంబంధం పెట్టుకుని అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే అత్త కూడా కూతురు వైపే మాట్లాడడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన సాయిలు... అత్తను కిరాతకంగా చంపేశాడు.
ఈ కేసులో ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించాడు సాయిలు. ఇక ఆ తర్వాత కూడా భార్యపై ఎక్కడా అనుమానం మాత్రం తగ్గలేదు. కొద్దికాలం నుంచి మళ్లీ భార్యపై అనుమానంతో వేధింపులకు దిగడం మొదలుపెట్టాడు సాయిలు. ఈ క్రమంలోనే ఏకంగా భార్యను కూడా హత్య చేయాలని భావించిన కసాయి భర్త ఏకంగా దారుణంగా భార్యను హత్య చేసి తల మొండెం వేరు చేసి.. భార్య తల తీసుకెళ్లి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ఎదుట పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పాటు గురి చేసిన విషయం తెలిసిందే.