ఇటీవలే భార్య తల నరికిన భర్త భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ముందు భార్య తలను ఉంచిన  ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పాటు గురి చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతుండగా పోలీస్ విచారణలో ఎన్నో ఊహించని నిజాలు కూడా బయట పడుతున్నాయి. అయితే కేవలం భార్యను  మాత్రమే కాదు అనుమానంతో ఏకంగా అత్తను  కూడా 15 ఏళ్ల కిందటే హత్య చేసినట్లు ఇటీవలే పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత భార్యను కాపురానికి తీసుకెళ్లాడు సదరు వ్యక్తి. మరోసారి అనుమానంతో ఏకంగా భార్యను దారుణంగా హత్య చేసిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జరిగింది.



 నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ కు చెందిన సాయిలు అనే 46 ఏళ్ల వ్యక్తికి  చౌదర్ పల్లి కి చెందిన అనసూయతో పాతికేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్దికాలం పాటు కాపురం ఎంతో సాఫీగా సాగిపోయింది. కాని అంతలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త సాయిలు. ఈ క్రమంలోనే సూటిపోటి మాటలు అంటూ తరచూ వేధింపులకు గురి చేసే వాడు. ఇక ఈ విషయాన్ని అనసూయ తన తల్లికి చెప్పుకుని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఓ సారి అత్త తో మీ కూతురు వివాహేతర సంబంధం పెట్టుకుని అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే అత్త కూడా కూతురు వైపే మాట్లాడడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన సాయిలు... అత్తను  కిరాతకంగా చంపేశాడు.



 ఈ కేసులో ఏకంగా జైలు శిక్ష కూడా అనుభవించాడు సాయిలు. ఇక ఆ తర్వాత కూడా భార్యపై ఎక్కడా అనుమానం మాత్రం తగ్గలేదు. కొద్దికాలం నుంచి మళ్లీ భార్యపై అనుమానంతో వేధింపులకు దిగడం  మొదలుపెట్టాడు సాయిలు. ఈ క్రమంలోనే ఏకంగా భార్యను కూడా హత్య చేయాలని భావించిన కసాయి భర్త ఏకంగా దారుణంగా భార్యను హత్య చేసి తల మొండెం వేరు చేసి.. భార్య తల  తీసుకెళ్లి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని  అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ఎదుట పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పాటు గురి చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: