వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష పార్టీ కి మద్దతుగా నిలుస్తున్న మీడియా ను ఎల్లో మీడియా అంటూ పలుమార్లు సంబోధిస్తూ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే..

అయితే మరొకసారి టీడీపీ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా పై పలు వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.ఈర్ష, ద్వేషాలతో రగిలిపోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాలు జేయాలి అంటే ఒకప్పుడు ఆకాశ రామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు అని తెలిపారు.

 అయితే అది కొందరు నిజమే అని నమ్మే పరిస్తితి ఉండేది అని అన్నారు. అయితే ఇప్పుడు అంత అజ్ఞానం ఎవరికి లేదు అని తెలిపారు.ప్రస్తుతం ఈ జనరేషన్ లో రెప్పపాటులోనే ప్రపంచంలో ఏ ములా ఏం జరిగిన ప్రతిఒక్కరికి తెలిసిపోతుంది.అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: