2019 జూలైలో ప్రారంభమై అదే ఏడాది అక్టోబర్ వరకు ఈ సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఒకటే చాట్ కాదు. ఓ వాల్యూమ్ పేజీల్లో హెడింగ్లు పెట్టి అర్నాబ్ గోస్వామి, వికాస్ ఐడెమ్, ఆర్ఆర్పీ గ్రూప్, రోమిల్ రంగారియా తదితరుల మధ్య జరిగిన సంభాషణలు కూడా విడుదల అయ్యాయి. కాగా, మిగిలిన చానెళ్లతో పోలీస్తే కొన్ని అంశాలను రిపబ్లిక్ చానెల్ ఏ విధంగా వక్రీకరిస్తూ వచ్చిందనే దానిపై మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు మాట్లాడుకున్న సంభాషణ మొదలు.. కేంద్ర మంత్రులపై బార్క్ మాజీ సీఈవో దాస్గుప్తా చేసిన వ్యాఖ్యల వరకు అన్నీ ఈ లీకైన చాట్లో కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ఒకరిని ‘‘యూజ్లెస్’’ అంటూ దాస్ గుప్తా తిట్టడం కూడా కనిపిస్తోంది. మరో సందేశంలో చానెల్ మనుగడకు సంబంధించి గోస్వామి ఉద్దేశ్య పూర్వకంగా స్పందిస్తూ.. ‘‘మంత్రులంతా మనతోనే ఉన్నారు..’’ అనడం సంచలనం రేపుతోంది.
2019 జూలైలో ప్రారంభమై అదే ఏడాది అక్టోబర్ వరకు ఈ సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఒకటే చాట్ కాదు. ఓ వాల్యూమ్ పేజీల్లో హెడింగ్లు పెట్టి అర్నాబ్ గోస్వామి, వికాస్ ఐడెమ్, ఆర్ఆర్పీ గ్రూప్, రోమిల్ రంగారియా తదితరుల మధ్య జరిగిన సంభాషణలు కూడా విడుదల అయ్యాయి. కాగా, మిగిలిన చానెళ్లతో పోలీస్తే కొన్ని అంశాలను రిపబ్లిక్ చానెల్ ఏ విధంగా వక్రీకరిస్తూ వచ్చిందనే దానిపై మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు మాట్లాడుకున్న సంభాషణ మొదలు.. కేంద్ర మంత్రులపై బార్క్ మాజీ సీఈవో దాస్గుప్తా చేసిన వ్యాఖ్యల వరకు అన్నీ ఈ లీకైన చాట్లో కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ఒకరిని ‘‘యూజ్లెస్’’ అంటూ దాస్ గుప్తా తిట్టడం కూడా కనిపిస్తోంది. మరో సందేశంలో చానెల్ మనుగడకు సంబంధించి గోస్వామి ఉద్దేశ్య పూర్వకంగా స్పందిస్తూ.. ‘‘మంత్రులంతా మనతోనే ఉన్నారు..’’ అనడం సంచలనం రేపుతోంది.