ఈ కామం కారణంగా కొందరు హంతకులు అవుతారు.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. మనుషులతో ఎంతటి పనైనా చేయించే శక్తి ఉన్న బలమైన ఎమోషన్ ఇది. ఈ విషయం పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి రుజువైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు చెందిన నాగూర్ అనే యువకుడికి తాళ్లపల్లికి చెందిన కుసుమ అనే మహిళతో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారింది.
అయితే.. ఈ కుసుమకు అప్పటికే వివాహం అయ్యింది. అయినా ప్రేమ, కామం గుడ్డివి కదా. ఇద్దరూ ఒకరిపట్ల మరొకరు పూర్తిస్థాయి మైకంలో మునిగిపోయారు. అందుకే ఇద్దరూ తమ ఇళ్లనుంచి వచ్చేసి.. నిడదవోలు మండలంలో శెట్టిపేటలో కాపురం పెట్టేశారు. కుసమ తరపు వాళ్లు వీళ్లను వెదుకుతూ బయలుదేరారు.. మొత్తానికి వీరిద్దరూ నిడదవోలు మండలంలో శెట్టిపేటలో ఉంటున్న సంగతి పసిగట్టారు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పథకం రచించారు.
నిడదవోలు మండలంలో శెట్టిపేటలోని ఓ ఇంట్లో నాగూర్, కుసుమ ఉన్న సమయంలో కుసుమ బంధువులు.. బయట నుంచి గడి పెట్టేశారు. ఊరందరినీ పోగేసేందుకు ప్రయత్నించారు. వీరి గుట్టు బయటపెట్టాలన్నది వాళ్ల ప్లాన్.. అయితే ఇది కాస్తా వికటించింది. తమ గుట్టు బయటపడుతుందన్న భయం.. అందరూ తమను గేలి చేస్తారన్న అవమానంతో.. ఏమీ చేయలో పాలుపోని వారు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. అలా వీరి కథ విషాదాంతమైంది.