నెల్లూరులో కరోనా కల్లోల పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయగానే స్పందించిన హెల్త్ మినిస్టర్ కు అభినందనలు ధన్యవాదములు చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరొక్క సారి సీఎంకి, హెల్త్ మినిస్టర్ ఆళ్ల నానికి విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. నెల్లూరు జిల్లాలో నిన్న 3325 పరీక్షలు చేస్తే 1347 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని అన్నారు. 40 శాతానికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రపంచంలోనే అరుదైన పరిస్థితి అని వివరించారు. వెంటనే నెల్లూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి..ప్రమాదకర పరిస్థితుల నుంచి నెల్లూరు జిల్లాను కాపాడండి అని కోరారు.

13 జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరులో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది అన్నారు. బెడ్లు, ఆక్సిజన్లు, వెంటిలేటర్లు, రెమ్ డెసివర్ అవసరమైన మేర సిద్ధం చేయండి అని కోరారు. రెమ్ డెసివర్ ను కేవలం జీజీహెచ్ కే పరిమితం చేయకుండా కోవిడ్ చికిత్స అందిస్తున్న నోటిఫైడ్ ఆస్పత్రుల్లోనూ అందుబాటులో ఉంచాలి అని ఆయన సూచించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు కళ్యాణ మండపాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది అని అన్నారు. ఒక మోస్తరు లక్షణాలు ఉన్నవారిని ఆ మండపాల్లోనూ, తీవ్రంగా ఉన్నవారిని ఆస్పత్రుల్లోనూ ఉంచి చికిత్స అందించాలి అని కోరారు.

యుద్ధప్రాతిపదికన అవసరమైన సిబ్బంది నియామకాలు జరగాలి అని సూచించారు. ఆస్పత్రుల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లోని వెంటిలేటర్లను కూడా కోవిడ్ రోగుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. నెల్లూరు జీజీహెచ్ లో ఖాళీగా ఉన్న సుమారు 90 వెంటిలేటర్లను ప్రైవేటు ఆస్పత్రులకు పంపి రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలి అని విజ్ఞప్తి చేసారు. నెల్లూరులో వెంటిలేటర్ సౌకర్యం లేక అనేక మంది చెన్నైకి వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు అని అన్నారు. ఓ వైపు వ్యాధి తీవ్రత, మరోవైపు మూడు, నాలుగు గంటల ప్రయాణం కూడా ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది అని తెలిపారు. నెల్లూరు జిల్లాలోని పరిస్థితులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి అని సూచించారు. ప్రజలను కాపాడే విషయంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని చేతులెత్తి వేడుకుంటున్నాను అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: