అధికార టిఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ . ఆర్ . ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని వెల్లడించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో వ్యాపార సామార్జ్యం పెరిగిందని అగ్రహించారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. బీజేపీ నేతలు.. ఎందుకు విదేశీ వ్యాపారం పై ఎందుకు రైడ్స్ చేయడం లేదని మండిపడ్డారు మధుయాష్కీ గౌడ్..
ఈ ఏడేళ్ల కాలంలో ఆత్మహత్యలు ఆగలేదు. నిరుద్యోగ యువత పరిస్థితి ఆగమైందని నిప్పులు చెరిగారు.


దేశంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న ప్లేస్ లలో మూడవ స్థానంలో తెలంగాణ ఉందని ఫైర్ అయ్యారు మధుయాష్కీ గౌడ్.  ఇక టీ.ఆర్.ఎస్ కు వీఆర్ఎస్ పలకాల్సిన సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు మధుయాష్కీ గౌడ్.తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ స్వంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా లో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు మధుయాష్కీ గౌడ్.. కోటి ఎకరాల మాగాణి అంటూ.. వరి వేస్తే ఉరి అంటున్నారని నిప్పులు చెరిగారు మధుయాష్కీ గౌడ్.. మూసి కాల్వలో మురికి ఎంతనో.. టీ.ఆర్.ఎస్ నేతల అవినీతి అంతలా ఉందని అగ్రహించారు మధుయాష్కీ గౌడ్.. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది.. కేసీఆర్ చేసిన గొప్పదనం లేదన్నారు.

తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకుంటే.. గొర్రెలు, బర్రెలు అంటున్నాడని అగ్రహించారు మధుయాష్కీ గౌడ్. రాహు కాలం.. రావుల కాలంలో ఏమీ రావన్నట్లుందన్నారు.  వచ్చే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మధుయాష్కి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ పార్టీ కూడా ఆపలేదని స్పష్టం చేశారు మధుయాష్కి.

మరింత సమాచారం తెలుసుకోండి: