కాలం తో పాటుగా టెక్నాలజీ కూడా పరుగులు పెడుతుంది. ఎన్నో కొత్త మొబైల్ ఫోన్లు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మరో ఫోన్ విడుదల అయ్యింది. అంతే కాదు అదే బెస్ట్ ఫోన్ కూడా. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 5జీ ఫోన్ల అమ్మకాల్లో ఎంఐ 10ఐ నంబర్ వన్‌గా నిలిచింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. ఐడీసీ ఇండియా నెలవారీ స్మార్ట్ ఫోన్ ట్రాకర్ డేటా ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలిపింది. ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలకు కాస్త టోన్ డౌన్ వేరియంట్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.


మనదేశ వినియోగదారుల కు తగ్గట్లు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు షియోమీ తెలిపింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. షియోమీ ఇండియా తన అధికారిక ట్వీటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. 2021 జనవరిలో జరిగిన అమ్మకాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించినట్లు షియోమీ పేర్కొంది. అయితే మొత్తంగా ఎంఐ 10ఐ స్మార్ట్ ఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయి? ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఏ ఫోన్లు నిలిచాయి అని సంస్థ వెల్లడించింది.


ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే..6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గానూ ఉంది.ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌ను అందించారు. 4820 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: