మనదేశ వినియోగదారుల కు తగ్గట్లు ఈ ఫోన్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు షియోమీ తెలిపింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. షియోమీ ఇండియా తన అధికారిక ట్వీటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. 2021 జనవరిలో జరిగిన అమ్మకాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించినట్లు షియోమీ పేర్కొంది. అయితే మొత్తంగా ఎంఐ 10ఐ స్మార్ట్ ఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయి? ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఏ ఫోన్లు నిలిచాయి అని సంస్థ వెల్లడించింది.
ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే..6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గానూ ఉంది.ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్ను అందించారు. 4820 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ను ఇది సపోర్ట్ చేయనుంది.