ఈమధ్య ఈటీవీలో ప్రసారమవుతున్న దాదాపు అన్ని సీరియల్స్ కూడా ఆడియన్స్ ను బాగా అలరించడమే కాకుండా మంచి ప్రేక్షకాదరణ కూడా పొందుతున్నాయి. ఇక అలాంటి సీరియల్స్ లో అత్తారింటికి దారేది అనే ధారావాహిక కూడా ఒకటి. ఇందులో ఉన్న పాత్రలు ఎప్పటికీ ఒక్కటే అయినా నటీనటులు మాత్రం మారుతూ ప్రేక్షకులను బాగా ఆలరిస్తున్నారు. ఇక అలాంటి వారిలో ఈ మధ్యకాలంలో కృష్ణవేణి పాత్రలో పల్లవి తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అత్తారింటికి దారేది సీరియల్ లో మాత్రమే కాదు ఈ టీవీలో ప్రసారమయ్యే మరి కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.. ఇకపోతే పల్లవి రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

అక్టోబర్ 13వ తేదీన పల్లవి రామిశెట్టి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ లో జన్మించింది. పల్లవి తండ్రి పేరు నాగేశ్వరరావు రామిశెట్టి.. తల్లి పేరు లలిత. పల్లవి ఈమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఇక పల్లవి ఒక కూతురు కాబట్టి తల్లిదండ్రుల గారాబం చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి . చదువు విషయానికి వస్తే,  హైదరాబాద్లోని తన విద్యను మొత్తం పూర్తి చేసింది. సోషియాలజీ ను పూర్తిచేసిన పల్లవికి చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి ఎక్కువ. అంతేకాదు సింగర్ గా కూడా ఈమె స్కూల్ అలాగే కాలేజీ డేస్ లో కూడా ఎన్నో బహుమతులను గెలుచుకుంది.

పల్లవి మొదట రంగుల కల అనే షో ద్వారా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. తర్వాత ఈ టీవీలో ప్రసారమైన భార్యామణి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది పల్లవి. అంతేకాదు ఈ సీరియల్ లో నటించిన తనకు నంది అవార్డు కూడా లభించడం గమనార్హం. ఆడదే ఆధారం, మాటేమంత్రం, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019 మే 23వ తేదీన దిలీప్ కుమార్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. పల్లవి భర్త హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: